
మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు జరగకుండా చూడాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శనివారం కలెక్టరేట్లోజిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'జిల్లాలో బాల్య వివాహాలు - నిర్మూలన' అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాగజ్యోతి మాట్లాడుతూ...అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు పూర్తి కాకుండా వివాహాలు జరిపిస్తే చట్టరీత్యా నేరమన్నారు.
ఈ విషయంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సభ్యులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాల్యవివాహాలు తగ్గించేందుకు మెదక్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రమేశ్, ఏఎస్పీ మహేందర్, డీడబ్ల్యువో బ్రహ్మాజీ, డీఈవో రాధాకిషన్, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, సీడీపీవోలు హేమభార్గవి, స్వరూప, సీడబ్ల్యుసీ చైర్మన్ వెంకట్రావు, సభ్యులు ఉప్పలయ్య, డీఎస్వో రాజిరెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జెమ్లానాయక్ పాల్గొన్నారు.